సెప్టెంబర్ 26వ తేది తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులొస్తాయి..
‘సెప్టెంబర్ 26 తర్వాత అనూహ్య మార్పులు’
May 17 2017 1:43 PM | Updated on Sep 5 2017 11:22 AM
హైదరాబాద్: సెప్టెంబర్ 26వ తేది తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులొస్తాయి.. దాని కోసం తమ పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్వరరావు అన్నారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అప్రజాస్వామిక, కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఉద్యమాలు చేయొద్దని టీఆర్ఎస్ నేతలు అనడం దివాళాకోరుతనమన్నారు. కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లెలా.. 50 లక్షల ఇళ్లకు వెళ్లి అందరినీ కలిసి వివరస్తామని అన్నారు.
Advertisement
Advertisement