బెంగళూరు :
పర్యాటకులకు మరింత సౌకర్యంగా ఉండేలా బెంగళూరు నుంచి తిరుపతికి ప్యాకేజ్ టూర్ ఏర్పాటుచేసేందుకు కర్ణాటకరాష్ట్ర ఆర్టీసీతో ఏపీ పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. ఈమేరకు బెంగళూరు కేఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఆర్.ఉమాశంకర్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ హిమాంశు శుక్ల ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. బెంగళూరు–తిరుమల మధ్య ప్యాకేజ్ టూర్ను ఈ నెల 12 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ ప్యాకేజ్ ద్వారా పర్యాటకులకు అమరావతి మల్టీ యాక్సల్ బస్సు సదుపాయం, హోటల్లో కాలకృత్యాలు, అల్పాహారం, భోజనంతో పాటు తిరుమలలో తక్షణ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు ఉంటాయి. బెంగళూరు నుంచి రోజూ రాత్రి 10 గంటలకు బయల్దేరే ఈ సర్వీస్ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయల్దేరుతుంది.
శుక్ర, శనివారాల్లో పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.2000 టికెట్ ధరగా నిర్ణయించారు. మిగతా రోజుల్లో పెద్దలకు రూ.2000 పిల్లలకు రూ.1700 టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కేఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, ప్రైవేట్ బుకింగ్ కేంద్రాల ద్వారా, ఆన్లైన్, మొబైల్ ఫోన్ ద్వారా 30 రోజుల ముందుగానే టికెట్లు బుక్చేసుకోవచ్చు. కార్యక్రమంలో కేఎస్ఆర్టీసీ డైరెక్టర్ బీఎన్ఎస్ రెడ్డి, ట్రాఫిక్ జనరల్ మేనేజర్ కేఎస్ విశ్వనాథ్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ జిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 7760990034, 7760990035 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చు.
బెంగళూరు నుంచి తిరుమలకు ప్యాకేజీ
Published Fri, May 5 2017 9:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement