ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనం

Williams Sisters Crash Out of French Open 2018 Doubles - Sakshi

పారిస్‌/రొనాల్డ్‌ గారోస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలో సంచలనం చోటు చేసుకుంది. ఉమెన్‌ డబుల్స్‌ విభాగం నుంచి విలియమ్స్‌ సిస్టర్స్‌ నిష్క్రమించారు. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో అండ్రెజా క్లెపాక్‌(స్లోవేనియా)-మరియా జోస్‌ మార్టినెజ్‌(ఇటలీ) చేతిలో  ఓటమిపాలయ్యారు. చివరి సెట్‌ను విలియమ్స్‌ సోదరీమణులు చిత్తుగా కోల్పోవటం విశేషం.

మొత్తం మూడు రౌండ్లలో 6-4, 6-7(4), 6-0 తేడాతో ఓడిపోయారు. నిర్ణయాత్మక రౌండ్‌లో కనీస పోటీని కూడా ప్రదర్శించలేకపోయారు. కాగా, సెరెనా-వీనస్‌లు ఇప్పటిదాకా 14 గ్రాండ్‌ స్లామ్‌ డబుల్స్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మహిళల సింగిల్స్‌ విభాగం నాలుగో రౌండ్‌లో భాగంగా సెరెనా, రష్యన్‌ టెన్నిస్‌ క్వీన్‌ మరియా షరపోవాతో తలపడనుంది. గతంలో వీరిద్దరి 18సార్లు తలపడగా, 16 సార్లు సెరెనా, 2 సార్లు షరపోవా నెగ్గారు. 

జకోవిచ్‌ ఖాతాలో మరో రికార్డు... పురుషుల విభాగంలో నోవాక్‌ జకోవిచ్‌‌(సెర్బియా).. స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో వర్దాస్కోపై 6-3, 6-4, 6-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. జకోవిచ్‌కు ఇది క్లే మైదానంలో 200వ విజయం. జకోవిచ్‌ తన తదుపరి మ్యాచ్‌లో ఇటలీకి చెందిన మార్కో కెచ్చినషియోతో తలపడనున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top