టీమిండియా విజయలక్ష్యం : 264 పరుగులు | West Indies set a target of 264 runs against India | Sakshi
Sakshi News home page

టీమిండియా విజయలక్ష్యం : 264 పరుగులు

Nov 27 2013 12:43 PM | Updated on Sep 2 2017 1:02 AM

కాన్పూరులో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.

కాన్పూరు : కాన్పూరులో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. దాంతో  264 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. అశ్విన్ రెండు, కుమార్, సమీ, జడేజా చెరో వికెట్  తీశారు. కాన్పూరు వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ అయిదు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.

ముగ్గురు విండీస్ ఆటగాళ్లు అర్థ సెంచరీ చేశారు. పావెల్ 70, శామ్యూల్ 71, డారెన్ బ్రావో 51 పరుగులు చేశారు. ఒకదశలో కరీబియన్ టీమ్ భారీ స్కోర్ చేసేలా కనిపించినా... చివరి ఓవర్లలో టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు.  వన్డే సిరీస్ గెలవాలంటూ మూడో వన్డేలో టీమిండియా తన లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement