ఫైనల్లో నార్త్‌జోన్

ఫైనల్లో నార్త్‌జోన్


విశాఖపట్నం: నార్త్‌జోన్ జట్టు దేవధర్ ట్రోఫీ ఫైనల్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో నార్త్‌జోన్ 100 పరుగుల తేడా తో సౌత్‌జోన్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది.





టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గంభీర్ (2), నితిన్(16), మన్‌దీప్ (0) విఫలమైనప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రజత్ పాలివాల్ (113 బంతుల్లో 107 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. సౌత్ బౌలర్ వినయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత సౌత్‌జోన్ 36.3 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. కరుణ్ (51), ఉతప్ప (47) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. హర్భజన్ సింగ్ (3/35), పర్వేజ్ రసూల్ (3/15) మూడేసి వికెట్లు తీసుకున్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top