ఒక్క పరుగుతో శ్రీలంక విజయం
ముక్కోణపు సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో బుధవారం జరిగిన వన్డేలో శ్రీలంక ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది.
బులవాయో: ముక్కోణపు సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో బుధవారం జరిగిన వన్డేలో శ్రీలంక ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు చేసింది. కుషాల్ మెండిస్ (73 బంతుల్లో 94; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), డిక్వెలా (106 బంతుల్లో 94; 7 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో శతకాలు చేజార్చుకున్నారు. అనంతరం వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు చేసింది. ఎవిన్ లూయీస్ (122 బంతుల్లో 148; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ సెంచరీ సాధించాడు. చివరి వరకు పోరాడినా... కెప్టెన్ హోల్డర్ (46 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) విండీస్ను గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో శ్రీలంక ఫైనల్లోకి ప్రవేశించింది.