
వెస్టిండీస్ విజయలక్ష్యం 123
వరల్డ్ టీ 20లో భాగంగా గ్రూప్-1లో వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా 123 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
నాగ్పూర్:వరల్డ్ టీ 20లో భాగంగా గ్రూప్-1లో వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా 123 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీ కాక్(47; 46 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించక పోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆదిలోనే హషీమ్ ఆమ్లా(1) వికెట్ ను రనౌట్ రూపంలో కోల్పోయింది. ఇక ఆ తరువాత తేరుకోని దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో కీలక వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డు ప్లెసిస్ (9), కోల్పోరోసో(0), ఏబీ డివిలియర్స్(10), డేవిడ్ మిల్లర్(1) లు వరుసగా క్యూకట్టారు. దీంతో సఫారీలు 47 పరుగులకే ఐదు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ తరుణంలో డీ కాక్కు జతకలిసిన వైజ్(28) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా కొద్దిగా తేరుకుంది. ఇక చివర్లో క్రిస్ మోరిస్(16 నాటౌట్) తనవంతు ప్రయత్నం చేయడంతో దక్షిణాఫ్రికా 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రస్సెల్, డ్వేన్ బ్రేవో, క్రిస్ గేల్లు తలో రెండు వికెట్లు సాధించారు.