దక్షిణాఫ్రికా పరుగుల వరద! | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా పరుగుల వరద!

Published Sun, Oct 25 2015 4:27 PM

దక్షిణాఫ్రికా పరుగుల వరద!

ముంబై: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో ఆదివారం ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా  దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తోంది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగిస్తూ టీమిండియాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. డివిలియర్స్(51;34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా హాఫ్ సెంచరీ చేయడంతో దక్షిణాఫ్రికా 40 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 294 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 

 

డివిలియర్స్ కు జతగా ఫస్ట్ డౌన్ లో వచ్చిన డు ప్లెసిస్(87) క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (23), డీకాక్(109) పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఆది నుంచి బ్యాట్ ఝుళిపించడంతో నాలుగు వందల పరుగుల మార్కును దాటే అవకాశాలు కనబడుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement