క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్‌

Sindhu And Praneeth Enters Japan Open Quarters - Sakshi

టోక్యో:  జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 11-21, 21-10, 21-13 తేడాతో ఆయూ ఒహోరి(జపాన్‌)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. ఆపై రెండో గేమ్‌ లో సత్తాచాటారు. ఇక మ్యాచ్‌ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైతం సింధు విజృంభించి ఆడారు.

ఏ దశలోనూ ఒహోరికి అవకాశం ఇవ్వని సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌ సాయి ప్రణీత్‌ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. సాయి ప్రణీత్‌ 21-13, 21-16 తేడాతో కాంటా సునెయామ(జపాన్‌)పై గెలిచి క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top