సెమీస్‌లో ఆంధ్రప్రదేశ్‌ | semis in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఆంధ్రప్రదేశ్‌

Dec 29 2016 12:00 AM | Updated on Aug 18 2018 5:57 PM

జాతీయ సీనియర్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

చెన్నై: జాతీయ సీనియర్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... పురుషుల విభాగంలో మాత్రం క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ 25–23, 25–18, 25–6తో తెలంగాణ జట్టును ఓడించగా... పురుషుల జట్టు 20–25, 20–25, 23–25తో రైల్వేస్‌ చేతిలో పోరాడి ఓడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement