శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది.
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఆట నాలుగో రోజు భోజన విరామానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. దీంతో లంకపై 266 పరుగుల ఆధిక్యం దక్కింది.
మురళీ విజయ్, అజింక్య రహానే అర్ధసెంచరీలు చేశారు. విజయ్ 82, కోహ్లి 10 పరుగులు చేసి అవుటయ్యాడు. రహానే 82, రోహత్ శర్మ 2 పరుగులతో ఆడుతున్నారు. శ్రీలంక బౌలర్లలో కుశాల్ 2 వికెట్లు పడగొట్లాడు. ప్రసాద్ కు ఒక వికెట్ దక్కింది.