breaking news
colombo test match
-
వర్షం వల్ల ముందుగానే ముగిసిన నాలుగో రోజు ఆట
Sri Lanka Vs India 2nd Test Match, Day 4: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య నాలుగో రోజు ఆట ముగిసింది. లంకను 290 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 213 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో లంకను ఫాలో ఆన్ ఆడిస్తోంది.ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూ ర్తయ్యే సరికి శ్రీలంక ఆరు వికెట్లు నష్టపోయి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. వాన వల్ల ముందుగానే ఆటను నిలిపివేశారు.ఆధిక్యంలోకి శ్రీలంకవర్షం వల్ల ఆట నిలిపివేసే సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసి.. 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కేశారా నువాంత 3, సొనాల్ దినుష 7 పరుగులతో ఉన్నారు.డిక్వెల్లా (5) ఔట్నిరోషన్ డిక్వెల్లా (5) రూపంలో లంక ఆరో వికెట్ కోల్పోయింది. సోనల్ దినూష (2)క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం లంక ఐదు పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.ఐదో వికెట్ డౌన్92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పసిందు సూరియబండారా ఔట్ కావడంతో లంక 212 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్లో పసిందు స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు.నాలుగో వికెట్ డౌన్23 పరుగులు చేసిన కెప్టెన్ ధనంజయ మానవ్ సుతార్ బౌలింగ్లో వెనుదిరగడంతో లంక 209 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.టీ విరామం అనంతరం ఆట తిరిగి మొదలైంది. ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక 200 పరుగుల మార్క్ దాటింది. ప్రస్తుతం లంక 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. క్రీజులో సూరియబండారా (91), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (17) పరుగులతో ఆడుతున్నారు.టీ విరామంఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక టీ విరామ సమయానికి 56 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పసిందు సూరియబండారా (90), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (14) పరుగులతో ఆడుతున్నారు. లంక మరో 14 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో ప్రసిధ్, సిరాజ్, మానవ్ సుతార్ తలా ఒక వికెట్ తీశారు.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక43.1వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన కమిందు మెండిస్ (55). కెప్టెన్ ధనంజయ డి సిల్వ క్రీజులోకి రాగా.. పసిందు 83 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 178-3 (43.2). ఇంకా 35 పరుగులు వెనుకబడి ఉన్న లంక.కమిందు హాఫ్ సెంచరీప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సిక్సర్ బాది కమిందు మెండిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం కమిందు 54, సూరియబండార 68 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. జట్టు స్కోర్ 162-2గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 51 పరుగులు వెనుకపడి ఉంది. నిలకడగా ఆడుతున్న సూరియబండార, కమిందు63 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ కోలుకుంది. పసిందు సూరియబండార (63), కమిందు మెండిస్ (43) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం జట్టు స్కోర్ 150-2గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆ జట్టు ఇంకా 63 పరుగులు వెనుకపడి ఉంది. రెండో ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీ చేసిన సూరియబండారపసిందు సూరియబండార రెండో ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో బౌండరీ బాది ఈ మార్కును దాటాడు. 31 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 112-2గా ఉంది. సూరియబండారకు జతగా కమిందు మెండిస్ (21) క్రీజ్లో ఉన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 101 పరుగులు వెనుకపడి ఉంది. లంచ్ బ్రేక్.. 130 పరుగుల వెనుకంజలో శ్రీలంకనాలుగో రోజు లంచ్ విరామం సమయానికి శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆ జట్టు ఇంకా 130 పరుగులు వెనుకపడి ఉంది. కమిందు మెండిస్ (10), పసిందు సూరియబండార (35) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక14.5వ ఓవర్: రవీంద్ర జడేజా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన కమిల్ మిశారా (32). అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వగా కమిల్ రివ్యూకు వెళ్లాడు. అయితే, అక్కడా ప్రతికూల ఫలితమే రావడంతో అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. పసిందుతో కలిసి కమిల్ మిశారా 58 పరుగుల మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మిశారా స్థానంలో కమిందు మెండిస్ క్రీజులోకి రాగా.. పసిందు 28 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 63-2.ఫాలో ఆన్.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంకఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో సరాన్ష్ జైన్కు క్యాచ్ ఇచ్చి ఉదారా (3) ఔటాయ్యడు. పసిందు క్రీజులోకి వచ్చాడు.ఫాలో ఆన్ ఆడనున్న శ్రీలంకదినుషా సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంకను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించలేకపోయాడు. 213 పరుగులు వెనుకపడి ఉన్న శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కొనసాగించనుంది. దినుషా సెంచరీ.. శ్రీలంక ఆలౌట్శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 పరుగుల వద్ద ముగిసింది. సెంచరీ హీరో దినుషా (103) చివరి వికెట్గా వెనుదిరిగాడు. దినుషా సరాన్ష్ జైన్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక86.5వ ఓవర్- 288 పరుగుల వద్ద శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సరాన్ష్ జైన్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి లహీరు కుమార (12) ఔటయ్యాడు. సెంచరీ పూర్తి చేసిన దినుషాఓవర్నైట్ బ్యాటర్ సోనల్ దినుషా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో బౌండరీతో మూడంకెల మార్కును దాటాడు. దినుషాకు ఇది వరసగా రెండో సెంచరీ. ఈ సిరీస్ తొలి టెస్ట్లోనూ అతడు సెంచరీ చేశాడు. నాలుగో రోజు మొదలైన ఆటఓవర్నైట్ స్కోర్ (శ్రీలంక తొలి ఇన్నింగ్స్) 265-8 వద్ద నాలుగో రోజు ఆట మొదలైంది. దినుష (85), లహీరు కుమార (8) ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు.భారీ ఆధిక్యంలో భారత్మూడో రోజు నిలిచే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. సొనాల్ దినుష 85 పరుగులు, లాహిరు కుమార 8 పరుగులతో అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే శ్రీలంక ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. లంక ఇన్నింగ్స్లో పసిందు సూరియబండార (80) అర్ద సెంచరీతో రాణించగా.. భారత్ తరఫున ప్రసిద్ద్, సుతార్ తలో 3 వికెట్లు తీశారు.పడిక్కల్, జురెల్ సెంచరీలుఅంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) శతకాలతో విజృంభించగా.. గిల్ (50), పంత్ (63) అర్ధసెంచరీలతో రాణించారు.చదవండి: శాసించేది మనమే! -
లంచ్ విరామానికి శ్రీలంక 134/5
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో విజయాన్ని భారత్ 5 వికెట్ల దూరంలో నిలిచింది. మరో 5 వికెట్లు తీస్తే విజయం కోహ్లి సేన సొంతమవుతుంది. చివరి రోజు భోజన విరామానికి శ్రీలంక 5 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. లంక విజయం సాధించాలంటే ఇంకా 252 పరుగులు చేయాల్సివుంటుంది. కెప్టెన్ మాథ్యూస్ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మాథ్యూస్ 59, పెరీరా 12 పరుగులతో ఆడుతున్నారు. ఈ మ్యాచ్ డ్రా అయితే సిరీస్ 1-1తో సమం అవుతుంది. -
22 ఏళ్ల నిరీక్షణకు 7 వికెట్ల దూరంలో..
-
22 ఏళ్ల నిరీక్షణకు 7 వికెట్ల దూరంలో..
భారత్ 22 ఏళ్ల కల సాకారమయ్యేందుకు 7 వికెట్ల దూరంలో ఉంది. శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్ను రెండు దశాబ్దాల తర్వాత గెలుచుకునే అవకాశం వచ్చింది. లంకతో కీలక మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం 386 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక 3 వికెట్ల నష్టపోయి 67 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ విజయానికి 7 వికెట్లు అవసరం కాగా, లంకకు 319 పరుగులు కావాలి. ఈ మ్యాచ్లో భారత్కే ఎక్కువ విజయావకాశాలున్నాయి. ఈ సిరీస్లో లంక, భారత్ 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. లంకలో టీమిండియా చివరి సారిగా 1993లో టెస్టు సిరీస్ నెగ్గింది. లంక లక్ష్యసాధనలో ఆరంభంలోనే టీమిండియా పేసర్లు ఆతిధ్య జట్టుకు షాకిచ్చారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆరో బంతికి ఓపెనర్ ఉపుల్ తరంగ.. పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్లో వికెట్ కీపర్ నమాన్ ఓజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కరుణరత్నే సైతం డకౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక జట్టు రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన చండీమల్ వికెట్ ను ఇషాంత్ కూల్చాడు. శర్మ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన చండీమల్ పెవిలియన్కు చేరాడు. ఆట ముగిసే సమయానికి సిల్వా(24), కెప్టెన్ మాథ్యూస్(22) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 21/3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 274 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ (50), అశ్విన్ (58) హాఫ్ సెంచరీలు చేయగా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ బిన్నీ 49, ఓజా 35, అమిత్ మిశ్రా 39 పరుగులతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 312 పరుగులు చేయగా, లంక 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
టీమిండియాదే పైచేయి కానీ..
శ్రీలంకతో మూడో టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించింది కానీ.. రెండో ఇన్నింగ్స్లో మూడు కీలక వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది. మ్యాచ్ మూడో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసేసరికి 21/3 స్కోరు చేసింది. అంతకుముందు భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్ లో లంకను 201 పరుగులకు కుప్పకూల్చింది. టీమిండియా ఓవరాల్గా ప్రస్తుతం 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, ఓపెనర్ చటేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డ్ అవ్వగా, మరో ఓపెనర్ రాహుల్ రెండు పరుగులు చేశాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రహానే(4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. కెప్టెన్ కొహ్లీ, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. అంతకుముందు టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చెలరేగటంతో శ్రీలంక తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఓపెనర్లు ఉపుల్ తరంగ, సిల్వతో పాటు కరుణరత్నే, కెప్టెన్ మాథ్యూస్, తిరిమన్నేలు స్వల్ప స్కోర్లకే వెనుదిరగటంతో ఓ దశలో 127 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన లంక ఇబ్బంది పడింది. అయితే పెరీరా (55) హాఫ్ సెంచరీతో పాటు హెరాత్(49) రాణించారు. టీమిండియ పేసర్ ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా, స్టువర్ట్ బిన్నీ చెరో రెండు వికెట్లు తీశారు. ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది. -
రెండు రన్స్ కే ఓపెనర్లు ఔట్
కొలంబోలో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కీలక ఆధిక్యం సాధించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్ కే వెనుదిరిగారు. ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో, ఓపెనర్ చతేశ్వర్ పుజారా ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. శ్రీలంక పేసర్లు ప్రదీప్, ప్రసాద్లు చెరో వికెట్ పడగొట్టారు. దీంతో రెండు పరుగులకే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది. అంతకు ముందు శ్రీలంక 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 111 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియ పేసర్ ఇషాంత్ శర్మకు ఐదు వికెట్లు లభించాయి. -
లంకతో మూడో టెస్టు: భారత్ కు ఆధిక్యం
ఐదు వికెట్లు కూల్చిన ఇషాంత్ శర్మ కొలంబో: కీలక టెస్టులో టీమిండియా జూలు విదిల్చింది. బ్యాటింగ్ లో చటేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కగా.. బౌలింగ్ లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ నిప్పులు చెరిగాడు. ఇషాంత్, ఉమేశ్, స్టువర్ట్ బిన్నీల పేస్ దెబ్బకు లంక తొలి ఇన్నింగ్స్ లో 201 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఇషాంత్ ఐదు వికెట్లు కూల్చగా.., బిన్న, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు, ఉమేష్ వికెట్ తీశారు. దీంతో టీమిండియాకు 111 పరుగుల ఆధిక్యం లభించింది. మ్యాచ్ మూడో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంక ఓపెనర్లు ఉపుల్ తరంగా, సిల్వతో పాటు కరుణరత్నే, కెప్టెన్ మాథ్యూస్, తిరిమన్నేలు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. పెరీరా (55) హాఫ్ సెంచరీతో పాటు హెరాత్(49) రాణించడంతో లంక ఈ మాత్రం స్కోరయినా చేయగలిగింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులు చేసింది. -
చెలరేగిన భారత పేసర్లు.. లంక విలవిల
కీలక టెస్టులో టీమిండియా జూలు విదిల్చింది. బ్యాటింగ్ లో చటేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కగా.. బౌలింగ్ లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ నిప్పులు చెరిగాడు. ఇషాంత్, ఉమేశ్, స్టువర్ట్ బిన్నీల పేస్ దెబ్బకు లంక టాపార్డర్ కుప్పకూలింది. మ్యాచ్ మూడో రోజు ఆదివారం టీ విరామ సమయానికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. హెరాత్ 47 పరుగులు, ప్రసాద్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇషాంత్ నాలుగు, బిన్నీ రెండు, ఉమేష్, అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు. లంక ఓపెనర్లు ఉపుల్ తరంగా, సిల్వతో పాటు కరుణరత్నే, కెప్టెన్ మాథ్యూస్, తిరిమన్నేలు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. పెరీరా (55) హాఫ్ సెంచరీతో పాటు హెరాత్ రాణించడంతో లంక ఈ మాత్రం స్కోరయినా చేయగలిగింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులు చేసింది. -
కష్టాల్లో లంకేయులు
కొలంబో: భారత్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక కష్టాల్లో పడింది. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అధిగమించాలంటే ఇంకా 265 పరుగులు చేయాల్సివుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టీమిండియా పేసర్లు లంక బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బంతులతో లంకేయుల భరతం పట్టారు. పదునైన బౌలింగ్ తో లంచ్ విరామ సమయానికే 5 వికెట్లు పడగొట్టారు. తరంగ(4), సిల్వా(3), కరుణరత్నె(11), చందిమాల్(23), మాథ్యూస్(1) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 2, స్టువర్ట్ బిన్నీ 2 వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 312 పరుగులకు ఆలౌటైంది. -
లంచ్ విరామానికి భారత్ 179/3
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఆట నాలుగో రోజు భోజన విరామానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. దీంతో లంకపై 266 పరుగుల ఆధిక్యం దక్కింది. మురళీ విజయ్, అజింక్య రహానే అర్ధసెంచరీలు చేశారు. విజయ్ 82, కోహ్లి 10 పరుగులు చేసి అవుటయ్యాడు. రహానే 82, రోహత్ శర్మ 2 పరుగులతో ఆడుతున్నారు. శ్రీలంక బౌలర్లలో కుశాల్ 2 వికెట్లు పడగొట్లాడు. ప్రసాద్ కు ఒక వికెట్ దక్కింది. -
సాహా అర్ధసెంచరీ; భారత్ 393 ఆలౌట్
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 393 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా(56) అర్ధసెంచరీ సాధించాడు. 106 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది రెండో అర్ధసెంచరీ. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లోనూ సాహా అర్ధసెంచరీ(60) చేశాడు. లోకేశ్ రాహుల్(108) సెంచరీ చేశాడు. కోహ్లి(78), రోహిత్ శర్మ(79) అర్థసెంచరీలు చేశారు. అమిత్ మిశ్రా 24 పరుగులు చేసి అవుటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో హెరాత్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రసాద్, మాథ్యూస్, చమీర రెండేసి వికెట్లు తీశారు.


