పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
టోక్యో: పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-స్టిక్రోవా ద్వయం 6-7 (3/7), 7-5, 10-8తో మిసాకి డోయి-కురిమి నారా (జపాన్) జోడీపై కష్టపడి గెలిచింది.