Sakshi News home page

సైనా నెహ్వల్కు నిరాశ

Published Fri, Jun 5 2015 6:07 PM

సైనా నెహ్వల్కు నిరాశ

జకర్తా: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో రెండో సీడ్ సైనా 21-16, 12-21, 18-21 స్కోరుతో ఐదో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. గంటా పది నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సైనా తొలి గేమ్లో విజృంభించి ముందంజ వేసింది. కాగా ఆ తర్వాత సైనా వెనుకబడింది. వరుసగా రెండు గేమ్లు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది.

Advertisement
Advertisement