ప్రిక్వార్టర్స్‌లో పి.వి.సింధు ఓటమి | PV Sindhu crash out in Japan open badminton tourney | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో పి.వి.సింధు ఓటమి

Sep 19 2013 1:45 PM | Updated on Sep 1 2017 10:51 PM

ప్రిక్వార్టర్స్‌లో పి.వి.సింధు ఓటమి

ప్రిక్వార్టర్స్‌లో పి.వి.సింధు ఓటమి

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తెలుగు ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు నిష్క్రమించింది.

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తెలుగు ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె పోరాటం ముగిసింది. గురువారం యమగుచి (జపాన్)తో 32 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో 6-21 17-21తో సింధు ఓటమి పాలయింది.

పురుషుల సింగిల్స్లో ఏపీ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్, ప్రపంచ 56వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో కాజుటెరు కొజయ్(జపాన్)పై శ్రీకాంత్ 21-12 21-16తో విజయం సాధించాడు. అరగంటలోనే మ్యాచ్ ముగించాడు. మరో మ్యాచ్లో జాన్ ఒ జొర్జన్సెన్(డెన్మార్క్)పై ప్రణయ్ 21-14 13-21 21-17తో గెలుపొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement