సచిన్ టెండూల్కర్ అందరికీ బాగా తెలుసు, సింధు, సైనాలంటే గుర్తు. కానీ నితిన్ తోమర్ అంటే తెలిసింది... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంతోనే. గత వేలంలో అతను ఏకంగా రూ. 93 లక్షలు పలికాడు. దీంతో ప్రొ కబడ్డీ లీగ్ విలువేంటో అందరికీ ఈ పాటికే అర్థమైవుంటుంది. ఇప్పుడు మళ్లీ వేలం జరుగనుంది. ఈసారి రూ. కోటిని అందుకునే ఆటగాడెవరైనా ఉంటారో చూడాలి.
ముంబై: క్రికెట్ క్రేజీ దేశంలో ఐపీఎల్ తర్వాత అంతగా ప్రాచుర్యం పొందిన లీగ్ ఏదైనా ఉందంటే అది ప్రొ కబడ్డీ లీగే (పీకేఎల్). బ్యాడ్మింటన్ లీగ్ ఆడుతూ... ఆగింది. మళ్లీ సాగుతోంది. కానీ పీకేఎల్ ప్రారంభమైనప్పటి నుంచి నిరాటంకంగా జరుగుతూనే ఉంది. 8 ఫ్రాంచైజీలు 12కు చేరాయి. ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్ను చూసిన నిర్వాహకులు ఒక ఏడాదైతే రెండు సార్లు పీకేఎల్ నిర్వహించారు. తాజాగా మళ్లీ కబడ్డీ కూత వేలంతో వార్తల్లోకి వచ్చింది. ఆరో సీజన్కు ముందు ఆటగాళ్ల వేలాన్ని నేడు, రేపు ఇక్కడి ఓ స్టార్ హోటల్లో నిర్వహించనున్నారు. 12 ఫ్రాంచైజీల్లో 9 ఫ్రాంచైజీలు ఇప్పటికే 21 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా ముగ్గురిని రిటెయిన్ చేసుకోవచ్చు. అయితే మిగతా మూడు ఫ్రాంచైజీలు మాత్రం జట్టునంతా కొత్త కూర్పుతో నింపేసేందుకు సిద్ధమయ్యాయి. యూపీ యోధ, యు ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్ ఏ ఒక్క ఆటగాడిని అట్టిపెట్టుకోలేదు.
కొత్తగా ఫ్యూచర్ కబడ్డీ హీరోస్...
ఈ సీజన్ వేలంలో మొత్తం 422 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండగా... ఇందులో 14 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరంతా ఇరాన్, బంగ్లాదేశ్, జపాన్, కెన్యా, కొరియా, మలేసియా, శ్రీలంక తదితర దేశాల ఆటగాళ్లు. ఈసారి కొత్తగా ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ (ఎఫ్కేహెచ్) వేలంలోకి వచ్చారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ పోటీల ద్వారా వీరంతా పీకేఎల్ వేలానికి అర్హత సంపాదించారు. పీకేఎల్లో ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 4 కోట్లు ఖర్చు చేయొచ్చు. జట్టులో కనిష్టంగా 18 మంది, గరిష్టంగా 25 మందికి మించకుండా ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.
కూత... కోటికి చేరుతుందా..?
Published Wed, May 30 2018 4:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement