ఉషు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం | Pooja Kadian won India's first ever Gold medal at the Wushu World Championship | Sakshi
Sakshi News home page

ఉషు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

Oct 4 2017 7:45 PM | Updated on Oct 4 2017 8:45 PM

Pooja Kadian won India's first ever Gold medal at the Wushu World Championship

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ఉషు వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. రష్యాలో జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారిణి పూజా కాడియన్‌ 75 కేజీల విభాగం ఫైనల్లో రష్యా ప్లేయర్‌ ఈవ్‌ గేనియా స్టెపనోవాపై విజయం సాధించి స్వర్ణం పొందింది. ఈ విజయంతో ఈ ‍క్రీడలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పూజా కాడియన్‌ గుర్తింపు పొందారు. ఇక ఈ విభాగంలో భారత్‌కు పతకం రావడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక పురుషుల 45 కేజీల విభాగంలో రమేశ్‌ చంద్ర సింగ్‌ కాంస్య పతకం గెలుపొందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement