బంగ్లాతో మ్యాచ్‌: పాకిస్తాన్‌ లక్ష్యం 240

Pakistan Target 240 Runs Against Bangladesh - Sakshi

శతకం చేజార్చుకున్న ముస్తాఫికర్‌ రహీమ్‌

అబుదాబి : ఆసియాకప్‌లో భాగంగా ఫైనల్‌ పోరు కోసం జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌ (4/20) దాటికి బంగ్లా 239 పరుగులకు ఆలౌట్‌ అయింది. ముస్తాఫికర్‌ రహీమ్‌ 99(116 బంతుల్లో 9 ఫోర్లు), మహ్మద్‌ మిథున్‌ 60(84 బంతులు, 4 ఫోర్లు), మహ్మదుల్లా (25)లు రాణించడంతో బంగ్లాదేశ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. కష్టాల్లో ఉన్న బంగ్లాను రహీమ్‌, మిథున్‌లు ఆదుకున్నారు.

ఈ క్రమంలో రహీమ్‌ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.  పాక్‌ బౌలర్లలో జునైద్‌ ఖాన్‌ నాలుగు, సహీన్‌ షా అఫ్రిది, హసన్‌ అలీ రెండు వికెట్లు తీయగా షాదబ్‌కాన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో భారత్‌ ఫైనల్‌ ఆడనుందన్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top