సుప్రీం కోర్టు ఆమోదించిన లోధా కమిటీ సిఫారసుల ప్రభావం దేశంలోని వివిధ క్రికెట్ సంఘాల ఎన్నికలపై పడింది.
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆమోదించిన లోధా కమిటీ సిఫారసుల ప్రభావం దేశంలోని వివిధ క్రికెట్ సంఘాల ఎన్నికలపై పడింది. కమిటీ సిఫారసులను ఆరు నెలల్లో ఆమోదించాల్సిన నేపథ్యంలో రాబోయే కొన్ని రోజుల్లో ఏ అసోసియేషన్కూ ఎన్నికలు నిర్వహించవద్దని బీసీసీఐకి కమిటీ సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31న బెంగాల్, కర్ణాటక క్రికెట్ సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.