ఏమీ తేల్చలేదు | No final decision today, Rajeev Shukla says ahead of IPL Governing Council meeting | Sakshi
Sakshi News home page

ఏమీ తేల్చలేదు

Jul 20 2015 12:07 AM | Updated on Sep 3 2017 5:48 AM

ఏమీ తేల్చలేదు

ఏమీ తేల్చలేదు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రెండు ప్రధాన జట్లపై వేటు పడిన నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి (జీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో

 లోధా తీర్పు అధ్యయనానికి
 వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
  ఆరు వారాల్లో ప్రతిపాదనలు
   ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం

 ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రెండు ప్రధాన జట్లపై వేటు పడిన నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి (జీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠగా ఎదురుచూసినా ప్రస్తుతానికి ఎటూ తేల్చలేదు. ఆదివారం జరిగిన ఈ సమావేశంలో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లను శాశ్వతంగా నిషేధిస్తారా? లేక బోర్డే తమ చేతుల్లోకి తీసుకుని నిర్వహిస్తుందా? అనే అనుమానాలకు సమాధానం దొరుకుతుందని అంతా భావించారు. అయితే ఈ వ్యవహారంపై జీసీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును పూర్తిగా అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఈ గ్రూప్ పనిచేస్తుంది. ఆరు వారాల్లోగా ఈ గ్రూప్ సభ్యులు తీర్పును చదివి ఐపీఎల్ పాలక మండలికి తగిన ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇస్తారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement