పంచ్ అదిరింది | nikhath Zarin entered to quarter-final | Sakshi
Sakshi News home page

పంచ్ అదిరింది

May 23 2016 2:20 AM | Updated on Sep 4 2017 12:41 AM

పంచ్ అదిరింది

పంచ్ అదిరింది

ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన 54 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 3-0తో ఎరికా అడ్‌జెయి (కెనడా)ను ఓడించింది. ఏకపక్షంగా జరిగిన ఈ బౌట్‌లో నిఖత్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే నిఖత్‌కు కనీసం కాంస్యం ఖాయమవుతుంది.

మరోవైపు భారత్‌కే చెందిన సోనియా (57 కేజీలు), సవీటి బోరా (81 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో సోనియా 3-0తో నోమిన్ డ్యూష్ (జర్మనీ)పై, సవీటి 2-1తో కెబికవా (బెలారస్)పై నెగ్గారు. అయితే 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో పూజా రాణి 0-3తో సవన్నా మార్షల్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయి రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. రియో ఒలింపిక్స్‌లో మహిళా బాక్సర్లకు 51, 60, 75 కేజీల విభాగాల్లో పోటీలుంటాయి. అయితే ఈసారి భారత్ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement