తాష్కెంట్: ఆసియా అండర్–15 బాక్సింగ్ చాంపియన్షిప్ (బాలికల విభాగం)లో 8 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. దాంతో వేర్వేరు కేటగిరీల్లో కనీసం 8 రజతాలు భారత్కు ఖాయమయ్యాయి. అక్షిత (33 కేజీలు), అన్జీ (37 కేజీ), సోనియా (40 కేజీలు), తాన్వి (43 కేజీలు), హన్షిక (46 కేజీలు), సునైనా (58 కేజీలు), భూమిక (61 కేజీలు), తాన్వి (64 కేజీల విభాగం) తమ సెమీ ఫైనల్ బౌట్లలో గెలిచి
ఫైనల్లోకి ప్రవేశించారు. ఇతర భారత బాక్సర్లలో జియా (35 కేజీలు), ఖుషీ రాణా (49 కేజీలు), కనిష్క (52 కేజీలు), ఆష్వి (67 కేజీలు), మాన్వి (70+ కేజీలు) సెమీ ఫైనల్ బౌట్లలో పరాజయం పాలయ్యారు.


