వాట్లింగ్ అజేయ సెంచరీ
న్యూజిలాండ్కు ఆధిక్యం
మౌంట్ మాంగని (న్యూజిలాండ్): ప్రత్యర్థి గాడితప్పిన బౌలింగ్ను సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ వికెట్ కీపర్ వాట్లింగ్ స్ఫూర్తిదాయక శతకం (119 బ్యాటింగ్; 15 ఫోర్లు)తో జట్టును ఆదుకున్నాడు. దీంతో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తన తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 394 పరుగులు చేసింది. 41 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వాట్లింగ్తోపాటు సాన్ట్నెర్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 144/4తో మూడో రోజు ఆట ఆరంభించిన న్యూజిలాండ్ను వాట్లింగ్... నికోల్స్ (41; 5 ఫోర్లు), గ్రాండ్హోమ్ (65; 7 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. మూడో రోజు 90 ఓవర్లు వేసిన ఇంగ్లండ్ బౌలర్లు 2 వికెట్లను మాత్రమే తీశారు.
మరిన్ని వార్తలు