సానియాకు మోడీ అభినందనలు | Sakshi
Sakshi News home page

సానియాకు మోడీ అభినందనలు

Published Sun, Sep 7 2014 11:56 AM

సానియాకు మోడీ అభినందనలు - Sakshi

న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఈ విజయం గర్వకారణమని మోడీ ప్రశంసించారు. ఇందుకు ప్రతిగా సానియా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా సానియాకు అభినందించారు.

యూఎస్ ఓపెన్లో బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సోర్స్తో జతకట్టిన సానియా మిక్స్డ్ డబుల్స్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ వచ్చిన సానియాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement