'ఆ కుర్రాడి విద్యా, కోచింగ్ ఖర్చులు ప్రభుత్వానివే' | Maharashtra to bear all expenses for teen cricket prodigy | Sakshi
Sakshi News home page

'ఆ కుర్రాడి విద్యా, కోచింగ్ ఖర్చులు ప్రభుత్వానివే'

Jan 5 2016 6:55 PM | Updated on Sep 3 2017 3:08 PM

ఇంటర్ స్కూల్ టోర్నీలో వెయ్యి పరుగులకు పైగా సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనవాడేకు చేయూతనిచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది.

ముంబై:ఇంటర్ స్కూల్ టోర్నీలో వెయ్యి పరుగులకు పైగా సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనవాడేకు చేయూతనిచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇక నుంచి ప్రణవ్ కు అయ్యే విద్యా, క్రికెట్ కోచింగ్ ఖర్చులను తామే భరిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావేదే ఆ కుర్రాడి ప్రతిభను కొనియాడుతూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ' ప్రణవ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఒక కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఇది రాష్ట్రానికే కాదు.. దేశానికే గర్వకారణం. అందుచేత ఆ 15 ఏళ్ల యువకుడికి నాణ్యమైన క్రికెట్ కోచింగ్ ఇప్పించడంతో పాటు, విద్యాపరమైన ఖర్చులను మహారాష్ట్ర సర్కారే భరాయించాలని నిర్ణయించింది 'అని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా ఆటో డ్రైవర్ అయిన ఆ కుర్రాడి తండ్రిని వినోద్ తావేదే కలిసి అభినందించారు.

మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన కల్యాణ్ లో ఉన్న కేసీ గాంధీ స్కూల్లో ప్రణవ్ 10 వ తరగతి చదువుతున్నాడు. ముంబై క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ టోర్నీలో  ఆ స్కూల్ తరపున బరిలోకి దిగిన ప్రణవ్.. ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన న మ్యాచ్‌లో 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009 (నాటౌట్) పరుగులు చేశాడు.సుమారుగా 395 నిమిషాల పాటు క్రీజ్ ను అంటిపెట్టుకుని ఉన్న ప్రణవ్ 312.38 స్ట్రైక్ రేట్ తో ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం.  అంతకుముందు ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉన్న 116 సంవత్సరాల ప్రపంచ రికార్డు చెరిగిపోవడమే కాకుండా,  2014లో  ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement