జీవివెస్టిండీస్ ‘ఎ’ 264/5

వెస్టిండీస్ ‘ఎ’ 264/5


మైసూర్: వెస్టిండీస్ ‘ఎ’ తో బుధవారం ప్రారంభమైన అనధికార తొలి టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు తడబడి పుంజుకుంది.  తొలి రోజు ఆట ముగిసేసరికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్లకు 264 పరుగులు చేసింది.

 

  ఫుదాదిన్ (4 నాటౌట్), వాల్టన్ (26 నాటౌట్) క్రీజులో ఉన్నారు. బ్రాత్‌వైట్ (92), కిర్క్ ఎడ్వర్డ్స్ (91) చెలరేగారు. ఓ దశలో 211/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న విండీస్‌ను భారత బౌలర్లు దెబ్బతీశారు. 26 పరుగుల తేడాతో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకున్నారు.  రసూల్ 2, షమీ, పాండే, పలివాల్ తలా ఓ వికెట్ తీశారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top