స్వర్ణంతో మెరిసిన కరణ్‌ | Karan Gets Gold Medla in Taekwondo Championship | Sakshi
Sakshi News home page

స్వర్ణంతో మెరిసిన కరణ్‌

Apr 6 2019 4:30 PM | Updated on Apr 6 2019 4:30 PM

Karan Gets Gold Medla in Taekwondo Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏయూ తైక్వాండో అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో వైఎంసీఏ నారాయణగూడ యామగుచి తైక్వాండో అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో యామగుచి ప్లేయర్లు 3 పతకాలను సాధించారు. అకాడమీకి చెందిన కరణ్‌ స్వర్ణంతో మెరవగా... ఎస్‌.ఎన్‌. పూజ, మహాదేవ్‌ చెరో రజత పతకాన్ని గెలుచుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను యామగుచి తైక్వాండో అకాడమీ శుక్రవారం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు ఆర్‌కే కృష్ణ, ఉపాధ్యక్షులు స్వప్నారెడ్డి, కార్యదర్శులు పి. సంధ్య స్మిత, బీజే వినయ్‌ స్వరూప్, కోచ్‌ డి. విశ్వనాథ్‌ పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement