ప్రపంచకప్‌ తర్వాత వన్డేలకు డుమిని గుడ్‌బై   | JP Duminy to retire from ODIs after World Cup | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ తర్వాత వన్డేలకు డుమిని గుడ్‌బై  

Mar 16 2019 12:18 AM | Updated on May 29 2019 2:49 PM

JP Duminy to retire from ODIs after World Cup - Sakshi

ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ తర్వాత రిటైర్‌ కానున్న క్రికెటర్ల జాబితాలో మరో క్రికెటర్‌ చేరాడు. ఇప్పటికే క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌), ఇమ్రా¯Œ  తాహిర్‌ (దక్షిణాఫ్రికా) ఈ మెగా ఈవెంట్‌ తర్వాత వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతామని ప్రకటించగా... వీరి సరసన తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్‌ జేపీ డుమిని చేరాడు.

34 ఏళ్ల డుమిని 2017లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా... జూ¯Œ –జూలైలో జరిగే వన్డే ప్రపంచకప్‌ తర్వాత వన్డే ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటానని తెలిపాడు. ఇప్పటి వరకు 193 వన్డేలు ఆడిన డుమిని 5,047 పరుగులు చేసి, 68 వికెట్లు పడగొట్టాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement