డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు అజయ్ జయరామ్, గురుసాయి దత్ ప్రీక్వార్టర్స్లో ప్రవేశించారు.
అల్మెరె: డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు అజయ్ జయరామ్, గురుసాయి దత్ ప్రీక్వార్టర్స్లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జయరామ్ 21-14, 21-10 స్కోరుతో ఫాబియన్ రోత్ (జర్మనీ)పై విజయం సాధించాడు.
మరో మ్యాచ్లో గురుసాయి 21-14, 21-19తో చున్ వీ చెన్ (చైనీస్ తైపీ)ని ఓడించాడు. ఇక మహిళల సింగిల్స్లో పీసీ తులసి 20-22, 21-15, 21-16తో మహులెట్టె (నెదర్లాండ్స్)పై గెలుపొందింది.