జూనియర్ పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు వరుసగా మూడో విజయం దక్కింది.
కాంటన్ (మలేసియా): జూనియర్ పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు వరుసగా మూడో విజయం దక్కింది. చైనాతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో టీమిండియా 4-1తో ఘనవిజయాన్ని అందుకుంది.
దీంతో పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచిన భారత్ గురువారం జరిగే క్వార్టర్స్లో పూల్ ‘బి’ చివరి స్థానంలో నిలిచిన ఒమన్తో ఆడనుంది. భారత్ తరఫున మన్ప్రీత్ సింగ్ జూని యర్ రెండు గోల్స్ చేయగా, హర్మన్ప్రీత్ సింగ్, అజిత్ పాండే మిగతా గోల్స్ చేశారు.