టాస్‌ గెలిచిన భారత మహిళలు | India won the toss and choose to field | Sakshi
Sakshi News home page

Feb 21 2018 4:23 PM | Updated on Feb 21 2018 4:26 PM

India won the toss and choose to field - Sakshi

సెంచూరియన్ ‌: భారత్‌-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత మహిళలు ఈ మ్యాచ్‌ గెలిచి సఫారీ గడ్డపై  మరో ఘనతను సొంతం చేసుకోవాలని ఉవ్విల్లురుతోన్నారు. ఇక ఆతిథ్య జట్టు పరువు కోసం పాకులాడుతుంది. 

గత మ్యాచ్‌ గెలుపు జోరును కొనసాగించి సిరీస్‌ రేసులో నిలవాలని భావిస్తోంది. ఇప్పటికే సఫారీ గడ్డపై భారత మహిళలు వన్డే సిరీస్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇదే మైదానంలో పురుషుల జట్ల పోరాటం ఉంటుంది. యాదృచ్ఛికమే అయినా... గెలిస్తే రెండు భారత జట్లూ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌లను సొంతం చేసుకుంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement