హాంకాంగ్‌తో భారత్‌ తొలి పోరు | India first fighting with Hong Kong | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌తో భారత్‌ తొలి పోరు

Jul 18 2018 5:03 AM | Updated on Jul 18 2018 5:03 AM

India first fighting with Hong Kong - Sakshi

న్యూఢిల్లీ: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో తమ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేసియాలోని జకార్తాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. హాకీ ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. పూల్‌ ‘ఎ’లో భారత్‌తోపాటు కొరియా, జపాన్, శ్రీలంక ఉన్నాయి. ఆగస్టు 22న హాంకాంగ్‌తో ఆడనున్న భారత్‌ ఆ తర్వాత వరుసగా జపాన్‌ (24న), కొరియా (26న), శ్రీలంక (28న) జట్లతో తలపడుతుంది.

పూల్‌ ‘బి’లో పాకిస్తాన్, మలేసియా, బంగ్లాదేశ్, ఒమన్, థాయ్‌లాండ్, ఇండోనేసియా జట్లున్నాయి. భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 19న ఇండోనేసియాతో ఆడుతుంది. ఆ తర్వాత కజకిస్తాన్‌ (21న), కొరియా (25న), థాయ్‌లాండ్‌ (27న) జట్లను భారత్‌ ‘ఢీ’కొంటుంది. పురుషుల, మహిళల విభాగంలో విజేతగా నిలిచిన జట్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement