విరాట్‌ సేన 'భారీ' విజయం | india beats srilanka by innings 239 runs in second test | Sakshi
Sakshi News home page

విరాట్‌ సేన 'భారీ' విజయం

Nov 27 2017 1:08 PM | Updated on Nov 9 2018 6:43 PM

india beats srilanka by innings 239 runs in second test - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

నాగ్‌పూర్‌:శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 'భారీ' విజయం సాధించింది. శ‍్రీలంకను రెండో ఇన్నింగ్స్‌లో 166 పరుగుకులకే కుప‍్పకూల‍్చిన విరాట్‌ సేన ఇన్నింగ్స్‌  239 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఏ దశలోనూ భారత్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేక పోయిన లంకేయలు నాల్గో రోజు లంచ్‌  ముగిసిన కాసేపటికే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలయ్యారు. 21/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంకేయులు తడబాటుకు గురై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. ఓవర్‌ నైట్‌ ఆటగాడు కరుణరత్నే(18)ను జడేజా అవుట్‌ చేసి శుభారంభం ఇవ్వగా, ఆపై తిరుమన్నే(23)ను ఇషాంత్‌ శర్మ అవుట్‌ చేశాడు. అటు తరువాత ఏంజెలో మాథ్యూస్ ‌(10) ను జడేజా పెవిలియన్‌ కు చేర్చాడు.

దాంతో లంకేయులు 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. మరో ఏడు పరుగుల పరుగుల వ్యవధిలో డిక్విల్లా(4)ను ఇషాంత్‌ అవుట్‌ చేయడంతో లంక 75 పరుగులకే ఐదు వికెట్లు కోల్పో‍యింది.  కాగా, మరో 91 పరుగుల వ్యవధిలో మిగతా ఐదు వికెట్లు చేజార్చుకోవడంతో లంకకు భారీ ఓటమి తప్పలేదు.  కెప్టెన్‌ చండిమాల్‌(61;82 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ​ సెంచరీ చేయగా, లక్మల్‌(31 నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో రవి చంద్రన్‌ అశ్విన్‌ నాలుగు వికెట్లు సాధించగా, ఇషాంత్‌ శర్మ,  జడేజా, ఉమేశ్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు తీసి విజయానికి సహకరించారు.

చండిమాల్‌-లక్మల్‌ ప్రతిఘటించినా..

ఈ రోజు ఆటలో ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్‌ ప్రారంభించిన లంకేయులు పోరాడటంలో పూర్తిగా విఫలమయ్యారు.  75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన లంకేయలు..107 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయారు. కాగా, తొమ్మిది వికెట్ కు లంక దాదాపు గంట పోరాడటం ఆకట్టుకుంది. చండిమాల్‌-లక్మల్‌ జోడి కాసేపు మరమ్మత్తులు చేసింది. ఈ జోడి 58 పరుగులు జోడించి లంక స్కోరు బోర్డును చక్కదిద్దే యత్నం చేసింది. కాగా, చివరి రెండు వికెట్లను లంక పరుగు వ్యవధిలో కోల్పోవడంతో ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇది భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో రెండో అతి పెద్ద విజయంగా నమోదైంది. అంతకుముందు(2007) ఢాకాలో జరిగిన టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ 239 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాదాపు పదేళ్ల తరువాత భారత్‌కు ఇన్నింగ్స్‌ 239 పరుగుల విజయం దక్కడం విశేషం. మరొకవైపు ఇన్నింగ్స్‌​ పరాజయాల్లో శ్రీలంకకు ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. ఈ టెస్టు మ్యాచ్‌లో విజయంతో భారత్‌ 1-0 ఆధిక‍్యంలో ఉంది. మూడో టెస‍్టు శనివారం ఫిరోజ్‌ షా కోట‍్ల మైదానంలో ఆరంభం కానుంది.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 205 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌​ 166 ఆలౌట్‌

భారత్‌ తొలి ఇన‍్నింగ్స్‌​  610/6  డిక్లేర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement