
బ్రిస్బేన్: వరుసగా రెండో వన్డేలోనూ ఆసీస్కు ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 4 వికెట్లతో గెలిచి ఐదు వన్డేల సిరీస్లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత ఆసీస్ 9 వికెట్లకు 270 పరుగులు చేసింది. ఫించ్ (106; 9 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ సాధించాడు.
ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసి విజయం సాధించింది. బెయిర్ స్టో (60; 9 ఫోర్లు), హేల్స్ (57; 7 ఫోర్లు, 1 సిక్స్) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జో రూట్ (46 నాటౌట్), బట్లర్ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు), వోక్స్ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్) తలోచేయి వేశారు. మూడో వన్డే ఆదివారం సిడ్నీలో జరుగనుంది.