‘టి20 ప్రపంచకప్‌’ ఆసీస్‌ చేతిలోనే ఉంది: సచిన్‌ | Decision Of T20 World Cup Rests On Cricket Australia, Sachin | Sakshi
Sakshi News home page

‘టి20 ప్రపంచకప్‌’ ఆసీస్‌ చేతిలోనే ఉంది: సచిన్‌

Jun 14 2020 9:58 AM | Updated on Jun 14 2020 10:03 AM

Decision Of T20 World Cup Rests On Cricket Australia, Sachin - Sakshi

న్యూఢిల్లీ: షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌లో టి20 ప్రపంచకప్‌ నిర్వహించాలా? వద్దా? అనేది క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)నే నిర్ణయిస్తుందని భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. ఐసీసీ కూడా ఇంకా ఈ అంశంపై స్పందించాల్సి ఉందని పేర్కొన్నాడు. ‘టి20 ప్రపంచకప్‌ నిర్వహణ అనేది క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఆర్థిక వ్యవహారాలతో పాటు పలు అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి.

ఈ వ్యవస్థలన్నీ ఏకమై టోర్నీ నిర్వహణకు దోహదపడతాయేమో చూడాలి. ఇది కఠిన నిర్ణయమే కానీ క్రికెట్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది పెద్ద సమస్య కాబోదు’ అని టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement