విజేత బాలీవుడ్ | bollywood team won in Film stars cricket match | Sakshi
Sakshi News home page

విజేత బాలీవుడ్

Dec 22 2013 2:55 AM | Updated on Apr 3 2019 7:12 PM

సినీ తారల క్రికెట్ మ్యాచ్‌లో బాలీవుడ్ జట్టు విజేతగా నిలిచింది. పరుగుల వేటలో బోల్తా పడిన టాలీవుడ్ 67 పరుగుల తేడాతో ఓడింది.

విశాఖపట్నం, న్యూస్‌లైన్: సినీ తారల క్రికెట్ మ్యాచ్‌లో బాలీవుడ్ జట్టు విజేతగా నిలిచింది. పరుగుల వేటలో బోల్తా పడిన టాలీవుడ్ 67 పరుగుల తేడాతో ఓడింది. వైఎస్సార్ స్టేడియంలో శనివారం జరిగిన ఈ డే నైట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బాలీవుడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.
 
 వరుణ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. రాజా శర్వాణి 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 45 పరుగులు సాధించాడు. ఆదర్శ్ 2 వికెట్లు తీయగా, రాజీవ్, ప్రిన్స్‌లు చెరో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన టాలీవుడ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement