పీపుల్స్ చాయిస్ అవార్డు రేసులో భువనేశ్వర్ | Bhubaneswar in People's Choice Award race | Sakshi
Sakshi News home page

పీపుల్స్ చాయిస్ అవార్డు రేసులో భువనేశ్వర్

Oct 9 2014 1:43 AM | Updated on Sep 2 2017 2:32 PM

పీపుల్స్ చాయిస్ అవార్డు రేసులో భువనేశ్వర్

పీపుల్స్ చాయిస్ అవార్డు రేసులో భువనేశ్వర్

దుబాయ్: భారత పేసర్ భువనేశ్వర్ ప్రతిష్టాత్మక పీపుల్స్ చాయిస్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

దుబాయ్: భారత పేసర్ భువనేశ్వర్ ప్రతిష్టాత్మక పీపుల్స్ చాయిస్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. తనతో పాటు ఈ అవార్డు కోసం దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్, ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక), మిచెల్ జాన్సన్ (ఆసీస్), చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్ మహిళా జట్టు కెప్టెన్) రేసులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తమ ఓటింగ్ ద్వారా విజేతను ఎన్నుకోవచ్చు. అలాగే ఐసీసీ ఉత్తమ టెస్టు, వన్డే జట్లతో పాటు ఇతర ఐసీసీ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితాను నవంబర్ 4న వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement