పాక్‌తో భారత్‌ డేవిస్‌కప్‌ పోరు

Bharat Davis Cup with Pakistan - Sakshi

తటస్థ వేదికపై నిర్వహణ?

నాగ్‌పూర్‌: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ జట్లు డేవిస్‌ కప్‌లో తలపడనున్నాయి. విదేశీ గడ్డపై ఆడాల్సిన ఈ టెన్నిస్‌ పోరులో భారత్‌... పాక్‌తో పోటీపడుతుంది. అయితే పాక్‌లో భారత్‌ ఆడే పరిస్థితి లేకపోవడంతో తటస్థ వేదికపై ఈ పోరు జరిగే అవకాశముంది. చివరి సారిగా భారత్‌ 1964లో పాకిస్తాన్‌లో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లు ఆడింది. తాజా ‘డ్రా’లో భాగంగా భారత్, పాక్‌లు ఈ సెప్టెంబర్‌లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తుంది. గతంలో మలేసియా (1973) తటస్థ వేదికపై చిరకాల ప్రత్యర్థులు తలపడ్డాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top