హోదాపై బాబు జిమ్మిక్‌లు చేస్తున్నారు: భూమన

YSRCP Leader Bhumana Karunakar Reddy Criticize  Chandrababu Naidu - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ధర్మపోరాట ధీక్ష పేరుతో కొంగ జపం​చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే ముద్దు అని అసెంబ్లీలో తీర్మానాలు చేసిన బాబు ఇప్పుడు మాత్రం దొంగ ధీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున‍్న పోరాటం రామానమజపం అయిందని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ కనిప్పించడం లేదని విమర్శించారు.

టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు పై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. తన నాలుగున్నర లక్షల కోట్ల దోపిడిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. శ్వేతపత్రం మరో అబద్దపు ప్రచార జిమ్మక్‌గా మార్చుకున్నారని భూమన వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top