
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గూడూరు (నెల్లూరు జిల్లా), 11.30 గంటలకు గిద్దలూరు (ప్రకాశం జిల్లా), మధ్యాహ్నం 1.30 గంటలకు దర్శి, 3.30 గంటలకు మైలవరం (కృష్ణా జిల్లా)లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.