నాకెవరూ గుడ్‌మార్నింగ్‌ చెప్పట్లేదు: మోదీ | you Never Respond To My Good Morning Messages, PM Modi Remarks At BJP Meet | Sakshi
Sakshi News home page

నాకెవరూ గుడ్‌మార్నింగ్‌ చెప్పట్లేదు: మోదీ

Dec 29 2017 3:00 AM | Updated on Mar 29 2019 5:57 PM

you Never Respond To My Good Morning Messages, PM Modi Remarks At BJP Meet - Sakshi

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ యాప్‌లో తాను ప్రతి రోజూ ఉదయం ఎంపీలందరికీ గుడ్‌మార్నింగ్‌ చెప్తున్నప్పటికీ ఎవరూ స్పందించడం లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఓ ఐదారుగురు నేతలు మాత్రమే తన సందేశాలకు ప్రతిస్పందిస్తున్నారన్నారు. బీజేపీ పార్లమెంటరీ విభాగం వారంతపు భేటీలో మోదీ ఈ మేరకు స్పందించారు.  మోదీ యాప్‌ను విరివిగా వాడాలని ఆయన ఎంపీలకు ఈ సందర్భంగా సూచించారు. గుడ్‌మార్నింగ్‌తో పాటు తాను పంపే ముఖ్యమైన విషయాలనూ ఎంపీలు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ప్రారంభించిన ఈ యాప్‌ను మోదీ ఇటీవల ముగిసిన గుజరాత్‌ ఎన్నికల్లోనూ విరివిగా వాడారు. పార్లమెంటుకు సరిగ్గా హాజరుకాని ఎంపీలకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు దక్కవని ఆగస్టులో మోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement