తీవ్ర విమర్శలు.. ‘అయినా తూటాలు పేలాల్సిందే’ | Yogi Adithyanath on Criticism over Restless Encounters | Sakshi
Sakshi News home page

Feb 9 2018 1:16 PM | Updated on Feb 9 2018 1:19 PM

Yogi Adithyanath on Criticism over Restless Encounters - Sakshi

యోగి ఆదిత్యానాథ్‌ (పాత చిత్రం)

లక్నో : అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు. 10 నెలల వ్యవధిలో 1,142 ఎన్‌కౌంటర్లు.. 38 మంది క్రిమినల్స్‌ హతం. గత 25 రోజుల్లో 60 ఎన్‌కౌంటర్లు 8 మంది గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టేశారు. ఇది ముఖ్యమం‍త్రి యోగి ఆదిత్యానాథ్‌ హయాంలో ఉత్తర ప్రదేశ్‌ పోలీస్‌ శాఖ సాధించిన ట్రాక్‌ రికార్డు. అయితే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గోరఖ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాస్త తీవ్రంగానే స్పందించారు.

‘‘ప్రతీ ఒక్కరికీ రక్షణ అవసరం. కానీ, తుపాకీనే నమ్ముకున్న కొందరు మాత్రం శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నారు. తుపాకీకి తుపాకీతోనే దెబ్బ కొట్టాలి. అలాంటి వారికి తూటాలతోనే సమాధానం ఇవ్వాలి. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గొద్దని అధికారులను ఆదేశిస్తున్నా. విమర్శలు చేసేవారు ప్రజల బాగోగులు గురించి ఆలోచించటం లేదు. అలాంటప్పుడు వారిని మేమెందుకు పట్టించుకోవాలి’’ అని యోగి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది కాలంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఓవైపు రాజకీయంగా విమర్శలు ఎదుర్కుంటుండగా.. యోగి ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం(గత నవంబర్‌లోనే) నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ ఎన్‌కౌంటర్‌ల విషయంలో యోగి ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు.
 
అసెంబ్లీలో రచ్చ... 
ఇక ఈ అంశంపై గురువారం యూపీ అసెంబ్లీలో పెద్ద రచ్చే జరిగింది. ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లలో అమాయకపు పౌరులను బలి తీసుకుంటున్నారని సమాజ్‌వాదీ పార్టీ వాదన వినిపించగా.. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఫ్లకార్డులు, నినాదాలతో సభను హోరెత్తించారు. ఇక మరికొందరు ప్రతిపక్ష సభ్యులు బెలూన్లను ఎగరేయటం.. గవర్నర్‌ మీదకు పేపర్లను విసిరేయటంతో మార్షల్స్‌ సీన్‌లోకి రావటం.. కాస్త ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement