‘ఆధార్‌’లో వయస్సు మార్చి.. అడ్డంగా దోచేస్తున్నారు! | TDP Leaders Changing Age in Aadhar Cards to Snatch Pension | Sakshi
Sakshi News home page

‘ఆధార్‌’లో వయస్సు మార్చి.. అడ్డంగా దోచేస్తున్నారు!

Feb 9 2019 10:28 AM | Updated on Feb 9 2019 12:19 PM

TDP Leaders Changing Age in Aadhar Cards to Snatch Pension - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేతల అక్రమాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తమ పార్టీ అధికారంలో ఉండటంతో ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని పచ్చనేతలు దోచేస్తున్నారు. ఆఖరికీ వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను కూడా వదిలిపెట్టడం లేదు. ఏకంగా ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంచేసి వారి పేరిట వచ్చే పెన్షన్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ వ్యవహారం తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం ‘మీ సేవ’లో వెలుగుచూసింది. ఇక్కడి మీ సేవను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు ఆధార్‌ కార్డుల్లో వయస్సును మారుస్తున్నారు. తక్కువ వయస్సు ఉన్నా కూడా ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంచి.. వృద్ధుల పేరిట వచ్చే పెన్షన్‌తో తమ జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement