కాంగ్రెస్‌ మోసం చేస్తే.. టీఆర్‌ఎస్‌ అణచివేసింది | Swami Purnananda fires on Congress and TRS | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మోసం చేస్తే.. టీఆర్‌ఎస్‌ అణచివేసింది

Dec 3 2018 1:46 AM | Updated on Mar 18 2019 9:02 PM

Swami Purnananda fires on Congress and TRS - Sakshi

యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తే.. టీఆర్‌ఎస్‌ అణచివేసిందని బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామీజీ విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి తరఫున నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి సిద్ధపడితే కేసీఆర్‌ అడ్డుకున్నారని దుయ్యబట్టారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ మాట మార్చారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నిరుద్యోగులందరికీ 2 లక్షల ఉద్యోగాలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement