హైదరాబాద్: నారాయణఖేడ్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, భూపాల్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చెయ్..నేను ఓడిపోతే ఉరేసుకుంటానని సస్పెండైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ సవాల్ విసిరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో టీఆర్ఎస్ అధిష్టానం, రాములు నాయక్ను సస్పెండ్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో రాములు నాయక్ బుధవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ నేతలను కలిశానంటున్నారు..ఎవరు ఎవరితో కలిశారో నార్కో టెస్ట్ చేయించుకుందామా అని సూటిగా అడిగారు. తనకు ఏ టికెట్ అవసరం లేదు..ఈ ఎన్నికల్లో పోటీచేయనని వ్యాక్యానించారు. తనకు కావాల్సింది గిరిజన రిజర్వేషన్లు మాత్రమేనని వెల్లడించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో పచ్చి అబద్ధాల పుట్టగా అభివర్ణిస్తున్నట్లు చెప్పారు. 1200 మంది అమరుల ఆత్మ నిన్నటి వర్ష రూపంలో కురిసిందన్నారు. కొత్త వాగ్దానాలంతో ప్రజలను మోసం చేసేందుకు టీఆర్ఎస్ బయలు దేరిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామాకాలన్నారు..నిధులు పార్టీలో కొంతమందికే వచ్చాయని ఆరోపించారు. నియామకాలు ఎటుపోయాయో తెలియదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల్ల అని శాపనార్ధాలు పెట్టారు. 20 ఏళ్ల అనుబంధాన్ని 20 నిమిషాల్లో కేటీఆర్ బొందపెట్టారని మండిపడ్డారు. ఎలాంటి షోకాజ్ ఇవ్వకుండా అహంకారంతో తనను సస్పెండ్ చేశారని వాపోయారు. తండాలు, గూడేలకే ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
రెండు కులాల మధ్య గతంలో ఏ ముఖ్యమంత్రి చిచ్చుపెట్టలేదని, గోండులకు..లంబాడాలకు, యాదవులకు..కురుమలకు, బెస్తలకు..ముదిరాజ్లకు మధ్య చిచ్చుపెట్టారని ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 25 నుంచి 30 సీట్లకు మించిరావని జోస్యం చెప్పారు. టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో 70 మంది కుంటి గుర్రాలేనని వ్యాక్యానించారు. తెలంగాణ నేతలు ఆలె నరేంద్ర, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవ్ రావ్ జాదవ్లు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు కానీ హరికృష్ణ చనిపోతే ముఖ్యమంత్రి కుటుంబమంతా వెళ్లారని మండిపడ్డారు. రేపటి నుంచి నామీద భౌతిక దాడులు..ప్రెస్మీట్ల ద్వారా దాడి చేయిస్తారని ఆరోపించారు. నాకుటుంబ సభ్యులకు ఏం జరిగినా కేసీఆర్దే బాధ్యత అని అన్నారు.
‘నేను ఓడిపోతే ఉరేసుకుంటా’
Published Wed, Oct 17 2018 1:03 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement