కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రాదు: టీఆర్‌ఎస్‌

srinivasa reddy fires on congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. 5సీట్లు వస్తే రాష్ట్రంలో అధికారం వచ్చినట్లుగా బీజేపీ నేతలు అనుకోవడం సరికాదన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతల దగ్గర సబ్జెక్టు లేక అనవ సర విషయాలు మాట్లాడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టిన వాటితోపాటు పెట్ట నివీ అమలు చేస్తోందని తెలిపారు.

తాము ఏం చేశామో చెప్పుకోవడానికి బోలెడంత విషయం ఉందని పేర్కొన్నారు. ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను చూస్తేనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లాగు తడుస్తోందని అన్నారు. చంద్రబాబు డబ్బులతో గెలవాలని ఉత్తమ్‌ ఆరాటపడుతున్నారని, రాష్ట్ర ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న చంద్రబాబుకు ఉత్తమ్‌ వంత పాడటం శోచనీయమన్నారు. కేసీఆర్‌ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని చెప్పా రు. పరిపూర్ణానంద బీజేపీ కండువా కప్పుకోగానే అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top