‘టీఆర్‌ఎస్‌లో హరీశ్‌ పనైపోయింది’ | Raghu nandana rao commented over harish rao | Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్‌లో హరీశ్‌ పనైపోయింది’

Sep 23 2018 2:57 AM | Updated on Sep 23 2018 2:57 AM

Raghu nandana rao commented over harish rao - Sakshi

చేగుంట (తూప్రాన్‌): టీఆర్‌ఎస్‌లో మంత్రి హరీశ్‌రావు పని అయిపోయిందని, సిద్దిపేట నుంచి హరీశ్‌రావును తప్పించి కేసీఆర్‌ పోటీ చేయనున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు సంచలన వాఖ్యలు చేశారు. చేగుంటలో శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌.వాసురెడ్డి తో కలసి విలేకరులతో మాట్లాడారు.

‘రాజకీయాల నుంచి తప్పుకోవాలనుంది’ అంటూ ఇబ్రహీంపూర్‌లో హరీశ్‌ చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌లో ఆయన పని ముగిసిందనేలా ఉన్నాయన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలిసిందన్నారు. మూడు రోజుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీలో అనేక మార్పుచేర్పులు చోటు చేసుకుంటాయని, హరీశ్‌ను సిద్దిపేట నుంచి తప్పించడానికి కసరత్తు జరుగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement