మిస్టర్‌ పీఎం.. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది

Mr PM, economy derailed, train of recession coming full throttle: Rahul Gandhi - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని మండిపడ్డారు. దేశ ఆర్థిక మందగమనం తొలగిపోయే సూచనలే కనిపించడం లేదన్న ఓ మీడియా కథనాన్ని ఉటంకిస్తూ.. దేశంలోకి ఆర్థిక మాంద్యం పూర్తిస్థాయిలో ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అసమర్థురాలని విమర్శించిన రాహుల్‌.. త్వరలోనే ఈ మాంద్యం నుంచి బయటపడతామని ఆమె చెప్తే నమ్మవద్దని, మందగమనం నుంచి మాంద్యం శరవేగంగా ముంచుకొస్తుందని ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top