మోదీ భోజనం ఖర్చు రోజుకు రూ.4 లక్షలు!! | Modi eats Rs.4lack mushrooms a day: Alpesh Thakor | Sakshi
Sakshi News home page

మోదీ భోజనం ఖర్చు రోజుకు రూ.4 లక్షలు!!

Dec 12 2017 5:15 PM | Updated on Aug 21 2018 2:39 PM

Modi eats Rs.4lack mushrooms a day: Alpesh Thakor - Sakshi

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ తేదీ దగ్గరపడేకొద్దీ రాజకీయ ఆరోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. గెలుపుకోసం కాంగ్రెస్‌ పార్టీ పాకిస్తాన్‌తో కుమ్మక్కైందన్న ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ యువనేత అల్పేశ్‌ ఠాకూర్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అవికాస్తా అభ్యంతరకరంగా ఉండటంతో బూమరాంగ్‌ అయ్యాయి.

మోదీ భోజనం ఖర్చు ఎంతో తెలుసా?
పఠాన్‌ జిల్లాలోని రాధన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న అల్పేశ్‌ ఠాకూర్‌.. మంగళవారం స్థానికంగా నిర్వహించిన ఒక సభలో మాట్లాడుతూ మోదీ భోజనం ఖర్చులపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘మన ప్రధాని మోదీగారు తినేది అలాంటి ఇలాంటి భోజనం కాదు.. తైవాన్‌ నుంచి తెప్పించే పుట్టగొడుగులు(మష్రూమ్స్) తింటారాయన! ఒక్కోటి రూ.80 వేలు ఖరీదైన మష్రూమ్స్ రోజుకు ఐదు తింటారు. అంటే ఆయన భోజనం ఖర్చు రోజుకు రూ.4లక్షలన్నమాట! ఇక ప్రధానిగారే అంత తింటుంటే.. సాధారణ బీజేపీ కార్యకర్తలు ఎలా ఉంటారో ఊహించుకోవచ్చు’’ అని అల్పేశ్‌ అన్నారు.

ఒకప్పుడు నల్లగా ఉండే మోదీ ఇప్పుడు టమాటాలా ఉన్నారు!
భోజనం ఖర్చు ఆరోపణలతోపాటు అల్పేశ్‌ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకప్పుడు మోదీ.. నా(అల్పేశ్‌) మాదిరిగానే నల్లగా ఉండేవారు. కానీ ఇప్పుడాయన నిగనిగలాడే టమాటా పండులా తయారయ్యారు. మష్రూమ్స్‌ తినడం వల్లే ఆయన ఒంటికి రంగుపట్టింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన మష్రూమ్స్‌ తినడం మొదలుపెట్టారని తెలిసింది’’ అని అల్పేశ్‌ అన్నారు. కాగా, మోదీని ‘నల్ల’మనిషి అనడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. శరీరం రంగును తక్కువచేసి మాట్లాడటం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement