ఈనెల 30న విశ్వరూప మహాసభ: మంద కృష్ణ | Manda Krishna Madiga Criticize On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఈనెల 30న విశ్వరూప మహాసభ: మంద కృష్ణ

Mar 23 2019 9:57 PM | Updated on Mar 23 2019 10:02 PM

Manda Krishna Madiga Criticize On Chandrababu Naidu - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 30న అమరావతిలోని ఉంగుటూరు మండలం వెల్దిపాడులో నిర్వహించనున్న విశ్వరూప మహాసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడం దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణతో సీఎం చంద్రబాబు మాదిగలను మోసం చేశాడని ఆరోపించారు.

2014లో ఎస్సీ వర్గీకరణ చేసి చంద్రబాబు పెద్ద మాదిగగా రుణం తీర్చుకుంటానని నమ్మించాడు చేశాడని విమర్శించాడు.  చంద్రబాబు మాటలు నమ్మి గత ఎన్నికల్లో మాదిగలు మద్దుతు పలికారని తెలిపారు. ఈనెల 30న తలపెట్టిన విశ్వరూప మహా సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement